ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోదుమూరులో కొండచిలువ కలకలంరేపింది. గ్రామంలోని చేపల చెరువులో ఏడడుగుల కొండచిలువ మత్స్యకారుల వలకు చిక్కింది. చేపల కోసం ఏర్పాటు చేసిన వలలో ఈ భారీ కొండచిలువ చిక్కగా.. అటవీశాఖ అధికారుల సమాచారం ఇచ్చారు.
వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అటవీ సిబ్బంది... కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అటవీ ప్రాంతంలో వదిలి వేశారు. కొండచిలువ దర్శనంతో... నిరంతరం అదే మార్గంలో వెళ్లే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.