ETV Bharat / state

రక్తపోటు మరణాలే ఎక్కువ: డబ్ల్యూహెచ్​వో ప్రతినిధి

author img

By

Published : Oct 30, 2019, 5:55 PM IST

కరీంనగర్​ జిల్లాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం పర్యటించింది. ఎయిడ్స్​, క్షయ, మలేరియా మరణాల కన్నా అధిక రక్తపోటుతో ఎక్కువ మంది చనిపోతున్నారని డబ్ల్యూహెచ్​వో ప్రతినిధి టామ్​ ఫ్రీడెన్​ తెలిపారు.

రక్తపోటు మరణాలే ఎక్కువ: డబ్ల్యూహెచ్​వో ప్రతినిధి


కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సభ్యులు సందర్శించారు. ప్రభుత్వ వైద్య సేవలో ఉచితంగా అందిస్తున్న మందులను స్వయంగా పరిశీలించారు. అధికరక్తపోటు నేటి పరిస్థితుల్లో ప్రాణాలను నిశబ్ధంగా హరిస్తోందని డబ్ల్యూహెచ్​వో ప్రతినిధి డాక్టర్ టామ్ ఫ్రీడెన్ అన్నారు. భారతదేశంలో ఎయిడ్స్, క్షయ, మలేరియా కన్నా రక్తపోటు మరణాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. సకాలంలో వైద్య సేవలు అందించడానికి ముందుగా వైద్య నిర్ధరణ జరగాల్సి ఉందని స్పష్టం చేశారు.

రక్తపోటు మరణాలే ఎక్కువ: డబ్ల్యూహెచ్​వో ప్రతినిధి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అధిక రక్తపోటు తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేశారని టామ్​ ఫ్రీడెన్​ తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవల్లో శాస్త్రీయ పద్ధతిని పాటిస్తూ సరైన మందులను సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలో అధిక రక్తపోటు నివారణకు అందిస్తున్న వైద్య సేవలు యావత్ భారతదేశం మాత్రమే కాక బంగ్లాదేశ్, ఆఫ్రికా, చైనా వంటి దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని టామ్​ ప్రసంశించారు.

ఇదీ చూడండి : అమెరికా సైన్యం చేతిలో బగ్దాదీ వారసుడు హతం


కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సభ్యులు సందర్శించారు. ప్రభుత్వ వైద్య సేవలో ఉచితంగా అందిస్తున్న మందులను స్వయంగా పరిశీలించారు. అధికరక్తపోటు నేటి పరిస్థితుల్లో ప్రాణాలను నిశబ్ధంగా హరిస్తోందని డబ్ల్యూహెచ్​వో ప్రతినిధి డాక్టర్ టామ్ ఫ్రీడెన్ అన్నారు. భారతదేశంలో ఎయిడ్స్, క్షయ, మలేరియా కన్నా రక్తపోటు మరణాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. సకాలంలో వైద్య సేవలు అందించడానికి ముందుగా వైద్య నిర్ధరణ జరగాల్సి ఉందని స్పష్టం చేశారు.

రక్తపోటు మరణాలే ఎక్కువ: డబ్ల్యూహెచ్​వో ప్రతినిధి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అధిక రక్తపోటు తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేశారని టామ్​ ఫ్రీడెన్​ తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవల్లో శాస్త్రీయ పద్ధతిని పాటిస్తూ సరైన మందులను సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలో అధిక రక్తపోటు నివారణకు అందిస్తున్న వైద్య సేవలు యావత్ భారతదేశం మాత్రమే కాక బంగ్లాదేశ్, ఆఫ్రికా, చైనా వంటి దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని టామ్​ ప్రసంశించారు.

ఇదీ చూడండి : అమెరికా సైన్యం చేతిలో బగ్దాదీ వారసుడు హతం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.