ETV Bharat / state

Kaleshwaram 3rd TMC Works: 'సెంటు భూమి కూడా ఇవ్వం.. మమ్మల్ని చంపి భూములు లాక్కోండి' - కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు

Kaleshwaram 3rd TMC Works: ఇప్పటికే మూడు సార్లు భూములు కోల్పోయామని.. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ కాలువ కోసం భూములు అడుగుతున్నారని.. రైతులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం కురిక్యాల రహదారిపై ఆందోళన చేపట్టారు.

Kaleshwaram 3rd TMC Works
Kaleshwaram 3rd TMC Works
author img

By

Published : Jan 27, 2022, 3:43 PM IST

Updated : Jan 27, 2022, 4:12 PM IST

Kaleshwaram 3rd TMC Works: కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కురిక్యాల రహదారిపై రైతులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ కాల్వ కోసం భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు, గ్రామస్థుల ఆందోళన సమాచారంతో పోలీసులు సైతం భారీగా మోహరించారు. ఆందోళనకు మద్దతు పలికిన టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, ఇతర కాంగ్రెస్​ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

Kaleshwaram 3rd TMC Work
కురిక్యాల రహదారిపై ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

"మాది విలాస్​సాగర్​ గ్రామం. రాజన్న సిరిసిల్ల. గతంలో కొంత భూమి తీసుకున్నారు. ఇప్పుడు ఇంకొంత భూమి తీసుకుంటామని చెబుతున్నారు. భూమంతా తీసుకున్నాక మేం ఎలా బతకాలి. మా పిల్లలను ఎవరు పెళ్లి చేసుకుంటారు. మా సమస్యపై నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్తున్నారు."

- లక్ష్మి, మహిళారైతు, విలాస్​ సాగర్​

"నిరసన తెలిపే అవకాశం ఇవ్వడంలేదు. రోడ్డుపైకి వస్తేనే అరెస్ట్​ చేస్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు భూములు కోల్పోయాం. ఇప్పుడు నాలుగోసారి భూములు అడుగుతున్నారు.. సెంటు భూమి కూడా ఇచ్చేందుకు సిద్ధంగాలేము. మమ్మల్ని చంపి భూములు లాక్కోండి."

- సురేందర్​, తాడిజెర్రి రైతు

ఇదీచూడండి:

Kaleshwaram 3rd TMC Works: కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. కురిక్యాల రహదారిపై రైతులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ కాల్వ కోసం భూములు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు, గ్రామస్థుల ఆందోళన సమాచారంతో పోలీసులు సైతం భారీగా మోహరించారు. ఆందోళనకు మద్దతు పలికిన టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, ఇతర కాంగ్రెస్​ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

Kaleshwaram 3rd TMC Work
కురిక్యాల రహదారిపై ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

"మాది విలాస్​సాగర్​ గ్రామం. రాజన్న సిరిసిల్ల. గతంలో కొంత భూమి తీసుకున్నారు. ఇప్పుడు ఇంకొంత భూమి తీసుకుంటామని చెబుతున్నారు. భూమంతా తీసుకున్నాక మేం ఎలా బతకాలి. మా పిల్లలను ఎవరు పెళ్లి చేసుకుంటారు. మా సమస్యపై నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్తున్నారు."

- లక్ష్మి, మహిళారైతు, విలాస్​ సాగర్​

"నిరసన తెలిపే అవకాశం ఇవ్వడంలేదు. రోడ్డుపైకి వస్తేనే అరెస్ట్​ చేస్తున్నారు. ఇప్పటికి మూడుసార్లు భూములు కోల్పోయాం. ఇప్పుడు నాలుగోసారి భూములు అడుగుతున్నారు.. సెంటు భూమి కూడా ఇచ్చేందుకు సిద్ధంగాలేము. మమ్మల్ని చంపి భూములు లాక్కోండి."

- సురేందర్​, తాడిజెర్రి రైతు

ఇదీచూడండి:

Last Updated : Jan 27, 2022, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.