ETV Bharat / state

రాజకీయ లబ్ధికోసం పీవీ కుటుంబాన్ని వాడుకోవద్దు: పొన్నం ప్రభాకర్

author img

By

Published : Feb 22, 2021, 2:46 PM IST

తెరాస రాజకీయ లబ్ధికోసమే మాజీ ప్రధాని పీవీ కుమార్తెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. నిజంగా పీవీ పైన ప్రేమ ఉంటే ఆయన కూతురికి రాజ్యసభ సభ్యత్వంగాని... గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

PCC executive president Ponnam Prabhakar
రాజకీయ లబ్ధికోసం పీవీ కుటుంబాన్ని వాడుకోవద్దు: పొన్నం ప్రభాకర్

రాజకీయ లబ్ధికోసం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుటుంబాన్ని వాడుకోవద్దని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్‌కు నిజంగా పీవీ పైన ప్రేమ ఉంటే వాణీదేవిని రాజ్యసభ సీటుగాని, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగాగాని అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పీవీని గౌరవిస్తూ అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించటంలో అర్థం లేదన్నారు. గెలవలేని, బలంలేని ఎమ్మెల్సీ స్థానంలో వాణీదేవికి అవకాశం ఇచ్చి... ఆ కుటుంబాన్ని అవమానపరిచే ప్రయత్నం చేయవద్దని పొన్నం తెరాసకు విజ్ఞప్తి చేశారు.

రాజకీయ లబ్ధికోసం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుటుంబాన్ని వాడుకోవద్దని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. కేసీఆర్‌కు నిజంగా పీవీ పైన ప్రేమ ఉంటే వాణీదేవిని రాజ్యసభ సీటుగాని, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగాగాని అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పీవీని గౌరవిస్తూ అభ్యర్థులు స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించటంలో అర్థం లేదన్నారు. గెలవలేని, బలంలేని ఎమ్మెల్సీ స్థానంలో వాణీదేవికి అవకాశం ఇచ్చి... ఆ కుటుంబాన్ని అవమానపరిచే ప్రయత్నం చేయవద్దని పొన్నం తెరాసకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: 'వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటేనే పీవీకి సరైన గౌరవం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.