కొవిడ్ బారిన పడిన ఓ వృద్ధుడు… ఎవరూ ఆదరించలేదని మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అదే గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువకుడు చొరవచూపి మృతునికి అంత్యక్రియలు నిర్వహించాడు.
![old man suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07:21:15:1621561875_tg-krn-03-20-karonathomrutiantyakriyalu-av-3038228_20052021235602_2005f_1621535162_605.jpeg)
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగపూర్కు చెందిన పోతారవేణి వెంగయ్య (69)కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. మనస్థాపంతో ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అదే గ్రామానికి చెందిన ఇమ్రాన్ పాషా అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి మృతదేహాన్ని పంచాయతీ ట్రాక్టర్లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కొవిడ్ భయంతో ఎవరు ముందుకు రాకున్నా... కుల మతాలకతీతంగా యువకుడు అంత్యక్రియలు నిర్వహించడాన్ని పలువురు అభినందించారు.
ఇదీ చూడండి: 'రాష్ట్రంలో అందరికి ఉచిత కరోనా చికిత్స అందించాలి'