తెలంగాణలో లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతిస్తోందని మందకృష్ణ మాదిగ కరీంనగర్లో స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి సోనియా అన్న కేసీఆర్ ఆ పార్టీని అణచివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ నుంచి బరిలో ఉన్న పొన్నం ప్రభాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించినందున లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు మందకృష్ణ చెప్పారు.
ఇవీ చూడండి: తెరాస కొత్త డ్రామాలకు తెరతీస్తోంది: ఉత్తమ్