కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి వరి ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ సందర్శించారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. తూకం పూర్తి చేసిన ధాన్యాన్ని సత్వరం రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
అకాల వర్షాలకు ధాన్యం తడిసినా... కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. యాసంగిలో పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.