కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. నియోజకవర్గంలోని గంగాధర మండలం నారాయణపూర్లో హరితహారంలో భాగంగా వెయ్యి ఈత, తాటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు.
తాటి వనంలో గీత కార్మికుల బింకితో స్థానికులు, ప్రజా ప్రతినిధులకు కల్లు పోశారు. చొప్పదండి నియోజకవర్గంలోని మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని, తనను ఆదరించిన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ఏ సమయంలోనైనా ముందుంటానని, ఏ త్యాగానికైనా వెనకాడనని ఆయన అన్నారు.
ఇదీ చూడండి: విదేశీ యాప్లకు ప్రత్యామ్నాయంగా 'ఎలిమెంట్స్'