ETV Bharat / state

వచ్చే నెల నుంచే రూ. 2000 పింఛన్ ​: ఈటల

వచ్చే నెల నుంచి రూ.2000 పింఛన్ వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్​ జిల్లా సైదాపూర్​, వెన్కపల్లి గ్రామాల్లో వినోద్​ తరఫున ప్రచారం నిర్వహించారు.

author img

By

Published : Mar 25, 2019, 4:51 PM IST

మాట్లాడుతున్న ఈటల
వచ్చే నెల నుంచే రూ. 2000 పింఛన్ ​: ఈటల
కరీంనగర్​ జిల్లా సైదాపూర్​, వెన్కపల్లి గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ రోడ్డు షోలో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీ తీశారు. వచ్చే నెల నుంచి ​ రూ.2000 పింఛన్ అందిస్తామని మంత్రి తెలిపారు. వర్షాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తామన్నారు. ప్రతి ఇంటింటికి మూడు నెలల్లో తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్​​, స్థానిక ఎమ్మెల్యే సతీశ్​ ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:'నిధులు తెచ్చే దమ్ము తెరాస ఎంపీలకే ఉంది'

వచ్చే నెల నుంచే రూ. 2000 పింఛన్ ​: ఈటల
కరీంనగర్​ జిల్లా సైదాపూర్​, వెన్కపల్లి గ్రామాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ రోడ్డు షోలో పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీ తీశారు. వచ్చే నెల నుంచి ​ రూ.2000 పింఛన్ అందిస్తామని మంత్రి తెలిపారు. వర్షాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తామన్నారు. ప్రతి ఇంటింటికి మూడు నెలల్లో తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్​​, స్థానిక ఎమ్మెల్యే సతీశ్​ ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:'నిధులు తెచ్చే దమ్ము తెరాస ఎంపీలకే ఉంది'

Intro:TG_KRN_101_25_ETELA ROAD_ROAD SHOW_AVB_C11
FROM:KAMALAKAR HUSNABAD C11
---------------------------------------------------------------------------- కరీంనగర్ జిల్లా సైదాపూర్, వెన్కపల్లి గ్రామాల్లో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ తెరాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సుమారు 1000 మంది తెరాస కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ సైదాపూర్ మండలం కరువు మండలమని ఈ మండలాన్ని వచ్చే వర్షాకాలం నాటికి కాలేశ్వరం నీళ్ళు తీసుకువచ్చి సంవత్సరానికి మూడు పంటలు పండే విధంగా సైదాపూర్ మండలాన్ని సశ్యామలం చేస్తామని, ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా వచ్చే మూడు నెలల్లో త్రాగునీరు అందిస్తామని, ఇంకొక నాలుగైదు రోజులు అయితే ఏప్రిల్ ఒకటో తేదీ వస్తుందని వెయ్యి రూపాయల పింఛను పొందుతున్న లబ్ధిదారులకు వచ్చే నెల నుండి రెండు వేల రూపాయల పింఛన్ అంద చేయబోతున్నామని, చదువుకున్న నిరుద్యోగులకు 3000 పెన్షన్ కూడా త్వరలో ఇవ్వబోతున్నామని తెలుపుతూ ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కాంగ్రెస్ వాళ్లు ఎన్ని కేసులు వేసినప్పటికీ వాటి విషయమై ముఖ్యమంత్రి గారు, నేను, మన ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ గారు కొట్లాడి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారని, అందుకే వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెరాస అభ్యర్థి వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.


Body:బైట్

1) ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు


Conclusion:కరీంనగర్ జిల్లా సైదాపూర్,వెన్కపల్లి గ్రామాలలో తెరాస ఎన్నికల ప్రచారం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.