కరీంనగర్ జిల్లా పరిధిలోని మానేరు జలాశయం నిండు కుండలా మారి జల కళను సంతరించుకుంది. జలాశయంలో నీరు ఎక్కువగా ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు మానేరులోని నీటిని దిగువకు వదిలారు. స్టేజ్ 1, 2 కాకతీయ కాలువ ద్వారా ఈ ప్రక్రియను కొనసాగించారు. మొదటగా 500 క్యూసెక్కుల నీటి విడుదల చేయగా... రోజుకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: మోదీ చేతిలో ఉన్న ఆ పరికరమేంటంటే?