ETV Bharat / state

లాక్​డౌన్​కు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్​ సూచన

రాష్ట్ర ప్రభుత్వం పొడిగించిన లాక్​డౌన్​కు ప్రజలందరూ సహకరించాలని కరీంనగర్​ జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. శర్మానగర్ నియంత్రిత ప్రాంతాల్లో మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ క్రాంతితో కలిసి పర్యటించారు.

author img

By

Published : Apr 20, 2020, 4:31 PM IST

karimnagar collector suggestion public should cooperate with the lockdown
లాక్​డౌన్​కు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్​ సూచన

కరీంనగర్​ జిల్లాలో కంటైన్​మెంట్​ ప్రాంతాల్లో ఉన్న వారు ఎవరూ కూడా బయటకు రావద్దని కలెక్టర్ కె.శశాంక సూచించారు. వారికి అవసరమైన అన్ని నిత్యావసరాలు ఇంటి వద్దకే పంపిణీ చేస్తామన్నారు. శర్మానగర్​లో ఒకరికి పాజిటివ్ వచ్చినందున, అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. వారితో ఎవరైనా సన్నిహితంగా ఉన్నట్లైతే వారు స్వచ్ఛదంగా ముందుకొచ్చి ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలన్నారు.

ముఖ్యంగా పోలీసులు, వైద్య సిబ్బంది నియంత్రిత ప్రాంతాల్లో వారు బయటకు రాకుండా కట్టుదిట్టమైన నిఘాపెట్టాలన్నారు. లాక్​డౌన్​కు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.

కరీంనగర్​ జిల్లాలో కంటైన్​మెంట్​ ప్రాంతాల్లో ఉన్న వారు ఎవరూ కూడా బయటకు రావద్దని కలెక్టర్ కె.శశాంక సూచించారు. వారికి అవసరమైన అన్ని నిత్యావసరాలు ఇంటి వద్దకే పంపిణీ చేస్తామన్నారు. శర్మానగర్​లో ఒకరికి పాజిటివ్ వచ్చినందున, అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. వారితో ఎవరైనా సన్నిహితంగా ఉన్నట్లైతే వారు స్వచ్ఛదంగా ముందుకొచ్చి ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలన్నారు.

ముఖ్యంగా పోలీసులు, వైద్య సిబ్బంది నియంత్రిత ప్రాంతాల్లో వారు బయటకు రాకుండా కట్టుదిట్టమైన నిఘాపెట్టాలన్నారు. లాక్​డౌన్​కు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు.

ఇదీ చూడండి : కానిస్టేబుల్ భార్యను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.