త్వరలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు తీర్పు వెలువడనున్న దృష్ట్యా ప్రజలంతా సంయమనంతో వ్యవహరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డి సూచించారు. అధికారులతో శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు వల్ల ఒకరు గెలిచారు... మరొకరు ఓడిపోయారు అనే అభిప్రాయంతో కాకుండా సుదీర్ఘ కాలంగా అపరిష్కృత సమస్యకు పరిష్కారం దొరికినట్లు భావించాలని సీపీ కోరారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కమలాసన్రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: అశ్రునయనాల మధ్య విజయారెడ్డి అంతిమయాత్ర