విఘ్నాలను తొలగించే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు కరీంనగర్లో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని వివేకానంద పురి కాలనీలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వినాయక మండపాన్ని ఏర్పాటు చేయకుండా ఇంటిలోపల బొజ్జ గణపయ్యను ఏర్పాటు చేసుకుని పూజలు చేశారు.
మట్టి వినాయకుడిని పూజించాలని కోరుతూ మూడు అడుగుల తక్కువ ఉన్న వినాయకున్ని ప్రతిష్ఠించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. మూడు రోజుల అనంతరం నిమజ్జనాన్ని చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: ఈగ ఫిక్షనల్.. ఎలుక ఒరిజినల్