రైతు పండించిన పంట పది మందికి లాభదాయకంగా ఉండే దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
వానాకాలంలో వ్యవసాయ సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశారు. సాగు చేసుకుంటే మన సారవంతమైన భూములను పండించుకుంటే రాబోయే కాలంలో రైతుకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ శశాంక, మేయర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండిః హైదరాబాద్ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..