కరీంనగర్ జిల్లా శాతవాహన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసరాలు, మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి తిమ్మాపూర్ రూరల్ సీఐ మహేశ్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న లాక్డౌన్ను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలను చేపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించాలని సూచించారు. అలాగే వ్యక్తిగత శుభ్రతను పాటించాలని వివరించారు.
ఇదీ చూడండి: కుమారుడి అంత్యక్రియలకు 2,000 కి.మీ ప్రయాణం