కరీంనగర్ జిల్లా చొప్పదండిలో అక్షరాస్యతపై స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశం నిర్వహించారు. ఈచ్ వన్ - టీచ్ వన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
ఇందుకోసం అక్షరాస్యులైన యువతీయువకులను తమ వాడల్లో స్వచ్ఛందంగా చదువురాని వారికి అక్షరాలు దిద్దించాలన్నారు. ప్రతి వారంలో ఒక రోజు బోధించే వారు కార్యాచరణ చర్చించటానికి సమావేశం కావాలన్నారు. మున్సిపల్ ఛైర్మన్ గుర్రం నీరజ, కౌన్సిలర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నాకు గర్వకారణంగా ఉంది: కేటీఆర్