కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ పుట్టిన రోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. గోపీకృష్ణ ఫంక్షన్ హాల్లో మేయర్, డిప్యూటీ మేయర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో 52 మంది తెరాస కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. మేయర్ సునిల్ రావు రక్తదాతలకు పండ్ల రసం అందించారు. మంత్రి గంగుల ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు మేయర్ తెలిపారు.