హైదరాబాద్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమక్షంలో ఆరేపల్లి మోహన్ గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు జడ్పీటీసీలు, సర్పంచులు అధికార పార్టీలో చేరారు. తెరాస ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆకర్షించాయని మోహన్ తెలిపారు. బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్న కేసీఆర్కు మద్దతుగా నిలిచేందుకు పార్టీలో చేరానన్నారు.
కేసీఆర్ చూసుకుంటారు
మోహన్ లాంటి సీనియర్ నేతల చేరికతో మానకొండూరు నియోజకవర్గంలో తెరాస మరింత బలపడుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సముచిత స్థానం కల్పించే విషయాన్ని కేసీఆర్ చూసుకుంటారని తెలిపారు.
ఇవీ చూడండి:'కేసీఆర్కు ఓటేస్తే మోదీకి వేసినట్లే'