ETV Bharat / state

ఘనంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు

author img

By

Published : Feb 14, 2021, 3:40 PM IST

మార్కండేయ జయంతిని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో సుమారు 2వేల మంది మహిళలతో కలశాల ఊరేగింపు చేపట్టారు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

Markandeya Jayanti celebrations in Kamareddy district
ఘనంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సుమారు 2వేల మంది మహిళలతో కలశాల ఊరేగింపు చేపట్టారు. సంఘం భవనం నుంచి నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా స్నేహపురి మార్కండేయ ఆలయం వరకు కలశాల యాత్ర సాగింది.

అనంతరం ఆలయంలో మార్కండేయునికి కలశాలలోని నీటితో అభిషేకం నిర్వహించారు. ఏటా మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని సంఘ ప్రతినిధులు అన్నారు. వరుసగా ఇది 4వ సంవత్సరమని పేర్కొన్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు, సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఘనంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు

ఇదీ చదవండి: ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

కామారెడ్డి జిల్లా కేంద్రంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సుమారు 2వేల మంది మహిళలతో కలశాల ఊరేగింపు చేపట్టారు. సంఘం భవనం నుంచి నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా స్నేహపురి మార్కండేయ ఆలయం వరకు కలశాల యాత్ర సాగింది.

అనంతరం ఆలయంలో మార్కండేయునికి కలశాలలోని నీటితో అభిషేకం నిర్వహించారు. ఏటా మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని సంఘ ప్రతినిధులు అన్నారు. వరుసగా ఇది 4వ సంవత్సరమని పేర్కొన్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు, సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఘనంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు

ఇదీ చదవండి: ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.