కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని మాలోత్ తండాలో ఈదురు గాలులకు ఓ ఇంటిపై కప్పు రేకులు ఎగిరిపోయి ముగ్గురు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు సంగీత, శిరీష, మీనాలను లింగంపేట ఆస్పత్రికి తరలించారు. ఈదురు గాలులకు ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయి తాము తీవ్ర అవస్థలు పడుతున్నామని బాధితులు వాపోయారు. ఇంటిపై కప్పు కూలి ఆర్థికంగానూ నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమకు రెండు పడక గదుల ఇళ్లు కేటాయించాలని అధికారులకు మొరపెట్టుకున్నారు.
ఇవీ చూడండి : కరోనా వైరస్ కొమ్మును విరిచే డిజైన్తో వ్యాక్సిన్!