ETV Bharat / state

ఈ తండ్రీకూతుళ్లు రాష్ట్రానికే గర్వకారణం: ద‌త్తాత్రేయ‌ - హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్

ఇటీవల కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ తండ్రీకూతుళ్లు.. ఆఫ్రికాలోని కిలిమంజారో ప‌ర్వ‌తాన్ని అధిరోహించి అరుదైన ఘ‌న‌తను సాధించారు. విష‌యం తెలిసిన‌ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌.. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారు.

Bandaru Dattatreya
Bandaru Dattatreya
author img

By

Published : May 7, 2021, 2:21 PM IST

ఆఫ్రికాలోని కిలిమంజారో ప‌ర్వ‌తం గిల్మన్స్ 5,685 మీటర్ల పాయింట్​ను అధిరోహించి అరుదైన ఘ‌న‌తను సాధించిన తండ్రీకూతుళ్లను హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌ ప్రత్యేకంగా అభినందించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన తిరునగరి శ్రీకాంత్, అతని కుమార్తె హిమలేఖ్యకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారు.

ధైర్యం, దృఢ సంకల్పంతో కష్టసాధ్యమైన అరుదైన ఘనత సాధించిన తండ్రీకూతుళ్లు రాష్ట్రానికే గర్వకారణమని దత్తాత్రేయ పేర్కొన్నారు. భవిష్యత్​లో ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను అధిరోహించే దిశగా మరిన్ని అద్భుతాలు సాధించాలని కోరారు.

ఆఫ్రికాలోని కిలిమంజారో ప‌ర్వ‌తం గిల్మన్స్ 5,685 మీటర్ల పాయింట్​ను అధిరోహించి అరుదైన ఘ‌న‌తను సాధించిన తండ్రీకూతుళ్లను హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ‌ ప్రత్యేకంగా అభినందించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన తిరునగరి శ్రీకాంత్, అతని కుమార్తె హిమలేఖ్యకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ పంపారు.

ధైర్యం, దృఢ సంకల్పంతో కష్టసాధ్యమైన అరుదైన ఘనత సాధించిన తండ్రీకూతుళ్లు రాష్ట్రానికే గర్వకారణమని దత్తాత్రేయ పేర్కొన్నారు. భవిష్యత్​లో ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను అధిరోహించే దిశగా మరిన్ని అద్భుతాలు సాధించాలని కోరారు.

ఇదీ చదవండి: రాగల మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.