భారత్-చైనా సరిహద్దులో జరిగిన కాల్పులో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు వీరమరణం చెందాడు. అమరుడైన అతనికి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో కామప్ప కూడలి వద్ద కాంగ్రెస్ నాయకులు కొవ్వొత్తులతో నివాళులర్పించారు.
మాతృభూమి కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ అమరజవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వీరజవాన్ల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్ హైమద్, కార్యకర్తలు పాల్గొన్నారు.