కాంగ్రెస్ పార్టీలో గెలిచి.. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే జాజాల సురేందర్కు చేదు అనుభవం ఎదురైంది. రెండేళ్లయినా నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి వచ్చినా ఎమ్మెల్యేను కాంగ్రెస్ మండల అధ్యక్షులు అడ్డుకున్నారు. నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పీఎస్కు తరలించారు.
![yellareddy MLA jajala surender](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nzb-10-27-mlanu-addukunna-congress-nayakulu-avb-ts10111_27032021142221_2703f_1616835141_3.jpg)
అభివృద్ధి కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ సమస్యలను వివరిస్తుంటే.. ఈయన మాత్రం నాగార్జున సాగర్లోని తిరుమలసాగర్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదోవ పట్టించడానికి సీఎం కేసీఆర్ జన్మదినం రోజున తెరాసలో చేరారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినా హామీలు ఎందుకు నెరవేర్చలేదని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు.