డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కాడు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు స్థలాలు మంజూరు చెయ్యాలని డిమాండ్ చేశాడు.
ఆన్లైన్లో నమోదు చేయని మొక్కజొన్న కొనుగోలు చేయాలని కోరాడు. చివరికి పోలీసులు, స్థానికులు ఫోన్ ద్వారా సర్ది చెప్పడంతో మొత్తానికి కిందికి దిగి వచ్చాడు.