జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాల గ్రామంలో కాంక్రీట్ రోడ్ల నిర్మాణా పనులను గ్రామం సర్పంచ్తో కలిసి జెడ్పీ ఛైర్ పర్సన్ సరిత భూమి పూజ చేసి ప్రారంభించారు. ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పథకం కింద గ్రామానికి రూ. 5 లక్షల సీసీ రోడ్లు మంజూరయ్యాయి.
గ్రామాల అభివృద్ధికి తెరాస ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని ఛైర్ పర్సన్ తెలిపారు. స్థానికి ప్రజా ప్రతినిధుల సహకారంతో మున్ముందు మరెన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపడతామని సర్పంచ్ తెలిపారు.
ఇదీ చూడండి: మధ్యప్రదేశ్లో రేపే బలపరీక్ష- సుప్రీంకోర్టు ఆదేశం