జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శక్తి పీఠాన్ని మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. వారు తొలుత బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి పూజల్లో పాల్గొన్నారు.
తుంగభద్రా నదికి నవంబర్ 20 నుంచి పుష్కరాలు రానున్నందున అధికారులతో చర్చించనున్నారు. పుష్కరాల నిర్వహణ సహా ఆలయ అభివృద్ధిపై జిల్లా ఉన్నతాధికారులు, దేవాలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: దిల్లీలో అంతకంతకూ క్షీణిస్తున్న వాయు నాణ్యత