ETV Bharat / state

పుల్లూరు టోల్ ప్లాజాను తనిఖీ చేసిన ఇంఛార్జీ ఎస్పీ

author img

By

Published : Apr 24, 2020, 9:02 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని పుల్లూరు టోల్ ప్లాజాను ఇంఛార్జీ ఎస్పీ అపూర్వ రావు తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.

డ్రోన్ల సాయంతో రహదారిపై భద్రతను పర్యవేక్షించిన ఇంఛార్జీ ఎస్పీ
డ్రోన్ల సాయంతో రహదారిపై భద్రతను పర్యవేక్షించిన ఇంఛార్జీ ఎస్పీ

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చెక్ పోస్ట్​ను ఇంఛార్జీ ఎస్పీ అపూర్వ రావు తనిఖీ చేశారు. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న తనిఖీ కేంద్రాన్ని ఎస్పీ అపూర్వ రావు పరిశీలించారు. సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతుండటం వల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సిబ్బందికి, ఎస్పీ పలు సూచనలు అందించారు. ఆంధ్రప్రదేశ్ కర్నూల్ ప్రాంతం నుంచి వచ్చే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం డ్రోన్ల సహాయంతో రహదారిపై భద్రతను పర్యవేక్షించారు.

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చెక్ పోస్ట్​ను ఇంఛార్జీ ఎస్పీ అపూర్వ రావు తనిఖీ చేశారు. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న తనిఖీ కేంద్రాన్ని ఎస్పీ అపూర్వ రావు పరిశీలించారు. సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదు అవుతుండటం వల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సిబ్బందికి, ఎస్పీ పలు సూచనలు అందించారు. ఆంధ్రప్రదేశ్ కర్నూల్ ప్రాంతం నుంచి వచ్చే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అనంతరం డ్రోన్ల సహాయంతో రహదారిపై భద్రతను పర్యవేక్షించారు.

ఇవీ చూడండి : 'వేసవిలో భారత్​ కరోనాను జయించొచ్చు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.