జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలలో పురపాలిక ఛైర్మన్ బీఎస్ కేశవ్ పర్యటించారు. 34వ వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో ముళ్ల చెట్లను తొలగించాలని సూచించారు.
డ్రైనేజీలో నిలిచిపోయిన మురుగు నీటిని తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణంలోని అన్ని వార్డులను సుందరంగా తీర్చిదిద్దాలని తెలిపారు. గద్వాలలో చాలా సమస్యలు ఉన్నాయని... పట్టణ ప్రగతి ద్వారా వాటికి పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి: కొడుకు వేసిన బొమ్మ చూసి మురిసిపోతున్న షారుక్