ETV Bharat / state

ఆటో బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం - auto accident at kothapally village gadwal district

జోగులాంబ జిల్లాలో కొండపల్లి నుంచి కొత్తపల్లి వస్తుండగా ఆటో బోల్తా పడింది. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలోని కర్నూల్​ ఆస్పత్రికి తరలించారు.

auto Roll over at kothapally two were serious shifted to kurnool
ఆటో బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం
author img

By

Published : Feb 16, 2020, 11:19 PM IST

జోగులాంబ జిల్లా గద్వాల మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపల్లిలో పనులు ముగించుకొని స్వగ్రామం కొత్తపల్లి వస్తుండగా కూలీలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

అప్రమత్తమైన స్థానికులు.. క్షతగాత్రులను గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్​ ఆస్పత్రికి తరలించారు.

ఆటో డ్రైవర్​ నిర్లక్ష్యమే కారణమని బాధితులు తెలిపారు. వేగం తగ్గించమని చెప్పినా తమ మాట లెక్కచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్​ రాముని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి వాహనం నడిపినట్లు గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న కొత్తపల్లి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు.

ఆటో బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం

ఇవీచూడండి: డివైడర్​ను ఢీకొన్న తుపాను వాహనం.. ముగ్గురు మృతి

జోగులాంబ జిల్లా గద్వాల మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపల్లిలో పనులు ముగించుకొని స్వగ్రామం కొత్తపల్లి వస్తుండగా కూలీలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

అప్రమత్తమైన స్థానికులు.. క్షతగాత్రులను గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్​ ఆస్పత్రికి తరలించారు.

ఆటో డ్రైవర్​ నిర్లక్ష్యమే కారణమని బాధితులు తెలిపారు. వేగం తగ్గించమని చెప్పినా తమ మాట లెక్కచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్​ రాముని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం తాగి వాహనం నడిపినట్లు గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న కొత్తపల్లి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు.

ఆటో బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం

ఇవీచూడండి: డివైడర్​ను ఢీకొన్న తుపాను వాహనం.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.