జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ నెల 15 నుంచి సంపూర్ణంగా ప్లాస్టిక్ను నిషేధిస్తున్నట్లు కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని సింగరేణి గెస్ట్ హౌస్లో ప్లాస్టిక్ పునర్వినియోగం చేసే సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం భూపాలపల్లి పట్టణంలో రోజుకు దాదాపు నాలుగు టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నాయని వెల్లడించారు.
ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ప్లాస్టిక్ పునర్వినియోగంతో టైల్స్ తదితర వస్తువులు తయారు చేసే హైదరాబాద్కు చెందిన అనన్య గ్రీన్ టెక్ కంపెనీ సీఈఓ అరుణను ఆయన కోరారు. అలాగే పట్టణంలో గల ప్లాస్టిక్ వ్యర్థాల వివరాలను కంపెనీ వారికి చూపించాలని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, కన్సల్టెంట్ అభిజిత్, తదితరులు పాల్గొన్నారు.