జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం తాడిచర్ల ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధర్నాకు దిగారు. ఖమ్మంపల్లి తాడిచర్ల ప్రధాన రహదారిపై బైఠాయించి.. నిరసన వ్యక్తం చేశారు.
జిల్లాలోని కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హార్ మండలాల్లో కురిసిన భారీ వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఫలితంగా ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తాము నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిచిన ధాన్యాన్నీ కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరారు.
ఇదీచూడండి: నిషేధిత గడ్డిమందు, నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత