జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీముక్తీశ్వర స్వామి ఆలయంలో దర్శనాలను నిలిపివేయనున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5వరకు నిలిపివేయాలని నిర్ణయించారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామికి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో అర్చకుల సమక్షంలోనే పూజలు నిర్వహించనున్నట్లు ఈవో మారుతి తెలిపారు.
ఆలయంలో ఇప్పటికే ఇద్దరు సిబ్బంది, ఒక అర్చుకుడు కరోనా బారిన పడ్డారు. గ్రామంలో 50కి పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు ఎక్కువగా వస్తున్నందున... ఆలయంలోకి భక్తులకు అనుమతించవద్దని నిర్ణయించినట్లు ఈవో వెల్లడించారు.
ఇదీ చదవండి: పది రెట్లు ధర పెంచి కరోనా మందుల అమ్మకం..!