జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనానికి నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ రోజు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.
విజయారెడ్డిని సజీవదహనం చేసిన నిందితుడికి ఉరిశిక్ష వేయాలని, హత్యకు ప్రేరేపించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చూడండి: ప్రైవేటు బస్సులకు అనుమతిని సవాల్ చేస్తూ వ్యాజ్యం