ETV Bharat / state

కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే రాజయ్య

జనగామ జిల్లా చిల్పూర్​ మండల కేంద్రంలో రూ.కోటి 24 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను 124 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అందజేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

author img

By

Published : Sep 22, 2020, 9:43 PM IST

kalyan laxmi cheques distribution at chilpur
కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల అందజేసిన ఎమ్మెల్యే రాజయ్య

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆడపడుచులకు పెద్దన్నలా వ్యవహరిస్తూ పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపిల్లకి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను పంపిణీ చేస్తున్నారని స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. మంగళవారం జనగామ జిల్లా చిల్పూర్​ మండలకేంద్రంలో 124 మంది లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను అందజేశారు.

mla tatikonda rajaiah distributed kalyan laxmi cheques at chilpur
కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల అందజేసిన ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ.కోటి 24 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్లల వివాహానికి అండగా నిలుస్తున్నారని రాజయ్య అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండిః పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆడపడుచులకు పెద్దన్నలా వ్యవహరిస్తూ పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపిల్లకి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను పంపిణీ చేస్తున్నారని స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. మంగళవారం జనగామ జిల్లా చిల్పూర్​ మండలకేంద్రంలో 124 మంది లబ్ధిదారులకు ఆయన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను అందజేశారు.

mla tatikonda rajaiah distributed kalyan laxmi cheques at chilpur
కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల అందజేసిన ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్​ ఘన్​పూర్​ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు రూ.కోటి 24 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పంపిణీ చేశారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్లల వివాహానికి అండగా నిలుస్తున్నారని రాజయ్య అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండిః పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించిన ఈసీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.