జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం యాపలగడ్డతండాలో ఓ కుర్రాడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. వ్యవసాయ బావి వద్ద మోటారు పంపు రిపేరు కాగా దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్ షాక్కు గురై సంతోష్ మృత్యువాత పడ్డాడు. మృతుని వదినకు తీవ్రగాయాలు కాగా జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక ఎస్సై వేణు గోపాల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం జనగామ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: బైక్ పై విన్యాసం... తెచ్చింది ప్రాణాపాయం