స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నా అని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో పేద ప్రజలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు.
ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు వస్తునప్పటికి.. అది ప్రజల కోసమేనని రాజయ్య స్పష్టం చేశారు. దాతల సహకారంతో నియోజకవర్గంలోని పేద ప్రజలకు నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు.. ప్రతి ఒక్కరూ పాటిస్తూ జీవన గమనాన్ని కొనసాగించాలని సూచించారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష