ETV Bharat / state

EC inquiry: నేడే కేంద్ర ఎన్నికల కమిషన్​ విచారణ.. తప్పు ఎవరిదో తేలనుందా?

author img

By

Published : Apr 16, 2023, 9:39 PM IST

Updated : Apr 17, 2023, 6:27 AM IST

Central Election Commission inquiry in Jagtial: జగిత్యాల ఎన్నిక వివాదం కేంద్ర ఎన్నికల కమిషన్ వద్దకు చేరింది. ఆ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించకపోవడాన్ని ఈసీ సీరియస్​గా తీసుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఈ వ్యవహారంపై జగిత్యాలలో విచారణ జరపనుంది.

Etv Bharat
Etv Bharat

Central Election Commission inquiry in Jagtial: జగిత్యాల ఎన్నికలు, ఈవీఎంల భద్రతపై ఈసీ విచారణ చేపట్టనుంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించకపోవడంతో కమిషన్ నేడు జగిత్యాలకు వచ్చి విచారణ జరపనుంది. 2018 సాధరణ ఎన్నిక్లలో అక్రమాలు జరిగాయంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ గతంలో హైకోర్టులోని కేసు వేశాడు. ఇన్నాళ్లు విచారణ కొనసాగుతునే ఉంది. ఈ నెల 10న హైకోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల వీఆర్‌కే ఇంజనీరింగ్‌ కళాశాలలో స్ట్రాంగ్​ రూంను తెరిచేందుకు జగిత్యాల కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అధికారులతో కలిసి వెళ్లారు. 3 రూమ్​లలో భద్రపరచగా ఒక రూమ్ తాళం చెవి మాత్రమే అధికారుల వద్ద లభ్యమైంది. దీనిపై మరోసారి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హైకోర్టుకు రాత పూర్వకంగా రాసి ఇచ్చారు. తాళం చెవుల మాయంపై హైకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను విచారణ జరపాలని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలతో నాచుపల్లి దగ్గర ఉన్న జేఎన్టీయూ కళాశాలలో ఈ విచారణ కొనసాగనుంది. ఈ విచారణకు అప్పటి ఎన్నిక్లలో పాల్గొన్న కలెక్టర్‌, బదిలీ అయిన కలెక్టర్‌తో పాటు ఆ ఎన్నికల్లో పాల్గొన్న అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ విచారణ నేపథ్యంలో జగిత్యాలలో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు గత సుమారు 5 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది.

అసలు ఏం జరిగిందంటే: 2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్​ టీఆర్​ఎస్​ పార్టీ తరుఫున పోటీ చేశారు. అదే నియోజక వర్గంలో కాంగ్రెస్​ పార్టీ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పోటీ చేశారు. రసవత్తరంగా జరిగిన ఈ ఎన్నికల్లో అతి తక్కువ 441 మెజారిటీతో కొప్పుల ఈశ్వర్​ గెలిచారు. ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని, అవకతవకలు జరిగాయని, సరిగ్గా ఓట్లు లెక్కించకుండా టీఆర్​ఎస్​ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు ఆరోపణలు చేశారు. ఈ విషయంలో న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని అప్పటిలో కాంగ్రెస్​ నాయకులు ప్రకటించారు.

అంతా మంత్రి పదవి కోసమేనా: కొప్పుల ఈశ్వర్​ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల్లో ఓటమి భయంతో.. కొప్పుల తప్పుడు మార్గంలో ఆ ఎన్నికల్లో గెలిచారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆయన కేవలం 441 ఓట్ల తేడాతో గెలవడంతో మరింత వివాదస్పదమైంది. దీంతో పాటు వీవీప్యాడ్​లో ఉన్న ఓట్లను లెక్కించకుండా అభ్యర్థి గెలుపు అధికారులు నిర్ణయించారని కాంగ్రెస్​ నాయకులు ఆరోపించారు. దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇవీ చదవండి:

Central Election Commission inquiry in Jagtial: జగిత్యాల ఎన్నికలు, ఈవీఎంల భద్రతపై ఈసీ విచారణ చేపట్టనుంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించకపోవడంతో కమిషన్ నేడు జగిత్యాలకు వచ్చి విచారణ జరపనుంది. 2018 సాధరణ ఎన్నిక్లలో అక్రమాలు జరిగాయంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ గతంలో హైకోర్టులోని కేసు వేశాడు. ఇన్నాళ్లు విచారణ కొనసాగుతునే ఉంది. ఈ నెల 10న హైకోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల వీఆర్‌కే ఇంజనీరింగ్‌ కళాశాలలో స్ట్రాంగ్​ రూంను తెరిచేందుకు జగిత్యాల కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా అధికారులతో కలిసి వెళ్లారు. 3 రూమ్​లలో భద్రపరచగా ఒక రూమ్ తాళం చెవి మాత్రమే అధికారుల వద్ద లభ్యమైంది. దీనిపై మరోసారి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హైకోర్టుకు రాత పూర్వకంగా రాసి ఇచ్చారు. తాళం చెవుల మాయంపై హైకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను విచారణ జరపాలని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలతో నాచుపల్లి దగ్గర ఉన్న జేఎన్టీయూ కళాశాలలో ఈ విచారణ కొనసాగనుంది. ఈ విచారణకు అప్పటి ఎన్నిక్లలో పాల్గొన్న కలెక్టర్‌, బదిలీ అయిన కలెక్టర్‌తో పాటు ఆ ఎన్నికల్లో పాల్గొన్న అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఈ విచారణ నేపథ్యంలో జగిత్యాలలో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు గత సుమారు 5 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది.

అసలు ఏం జరిగిందంటే: 2018 శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్​ టీఆర్​ఎస్​ పార్టీ తరుఫున పోటీ చేశారు. అదే నియోజక వర్గంలో కాంగ్రెస్​ పార్టీ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ పోటీ చేశారు. రసవత్తరంగా జరిగిన ఈ ఎన్నికల్లో అతి తక్కువ 441 మెజారిటీతో కొప్పుల ఈశ్వర్​ గెలిచారు. ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని, అవకతవకలు జరిగాయని, సరిగ్గా ఓట్లు లెక్కించకుండా టీఆర్​ఎస్​ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు ఆరోపణలు చేశారు. ఈ విషయంలో న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని అప్పటిలో కాంగ్రెస్​ నాయకులు ప్రకటించారు.

అంతా మంత్రి పదవి కోసమేనా: కొప్పుల ఈశ్వర్​ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికల్లో ఓటమి భయంతో.. కొప్పుల తప్పుడు మార్గంలో ఆ ఎన్నికల్లో గెలిచారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆయన కేవలం 441 ఓట్ల తేడాతో గెలవడంతో మరింత వివాదస్పదమైంది. దీంతో పాటు వీవీప్యాడ్​లో ఉన్న ఓట్లను లెక్కించకుండా అభ్యర్థి గెలుపు అధికారులు నిర్ణయించారని కాంగ్రెస్​ నాయకులు ఆరోపించారు. దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 17, 2023, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.