ఉపాధ్యాయ సంఘాలు రేపు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ముందుస్తు అరెస్టులు చేశారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, వెల్గటూర్, బీర్పూర్, కొడిమ్యాల, మల్యాల మండలాల్లోని ఉపాధ్యాయ సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 130 మందిని అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని, ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ట్రంప్తోపాటు ఆ దేశాధినేతకూ కరోనా ముప్పు!