ETV Bharat / state

మొక్కజొన్న పంటలపై వానరాల దాడి.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు

author img

By

Published : Aug 28, 2020, 2:11 PM IST

మొన్నటి వరకు వర్షాలతో సతమతమైన మెట్​​పల్లి రైతులు.. ఇప్పుడు కోతుల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో.. వానరాల దాడిలో విరిగిపడిన పైర్లను చూసి తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వమే తమకు ఈ కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.

monkey-attack-on-maize-crops-feeders-in-a-state-of-disorientation
మొక్కజొన్న పంటలపై వానరాల దాడి.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి శివారులోని వ్యవసాయ భూముల్లో పండించే పంటలకు రక్షణ కరువైంది. కోతుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ఇప్పటికే కొంత పంట నష్టపోయిన రైతులకు.. ఈ కోతులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఫలితం లేకుండా పోయింది..

పట్టణ శివారులో పలువురు రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే సుమారు 100కు పైగా కోతులు పంటలపై దాడి చేస్తూ.. చేతికొచ్చిన పంటను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వానరాల బెడద నుంచి తప్పించుకునేందుకు గతంలో కూరగాయలు సాగు చేసిన రైతులు.. ఈసారి మొక్కజొన్న పంట సాగుచేసినా కోతుల బెడద తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకు నీరు పెట్టడానికి వచ్చే సమయంలో ఒకరిద్దరు రైతులు ఉంటే కోతులు దాడి చేస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు.

ప్రభుత్వమే విముక్తి కల్పించాలి..

పంట చేతికొచ్చే సమయంలో విరిగిపడిన మొక్కజొన్న పైర్లు చూసి రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. కోతులతో ప్రతిసారి పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతోందని.. ప్రభుత్వం స్పందించి తమకు కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.

monkey-attack-on-maize-crops-feeders-in-a-state-of-disorientation
మొక్కజొన్న పంటలపై వానరాల దాడి.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు

ఇదీచూడండి.. పరీక్షల వాయిదాకు నేడు​ కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

జగిత్యాల జిల్లా మెట్​పల్లి శివారులోని వ్యవసాయ భూముల్లో పండించే పంటలకు రక్షణ కరువైంది. కోతుల బెడద నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ఇప్పటికే కొంత పంట నష్టపోయిన రైతులకు.. ఈ కోతులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఫలితం లేకుండా పోయింది..

పట్టణ శివారులో పలువురు రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు. అయితే సుమారు 100కు పైగా కోతులు పంటలపై దాడి చేస్తూ.. చేతికొచ్చిన పంటను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వానరాల బెడద నుంచి తప్పించుకునేందుకు గతంలో కూరగాయలు సాగు చేసిన రైతులు.. ఈసారి మొక్కజొన్న పంట సాగుచేసినా కోతుల బెడద తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకు నీరు పెట్టడానికి వచ్చే సమయంలో ఒకరిద్దరు రైతులు ఉంటే కోతులు దాడి చేస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు.

ప్రభుత్వమే విముక్తి కల్పించాలి..

పంట చేతికొచ్చే సమయంలో విరిగిపడిన మొక్కజొన్న పైర్లు చూసి రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఆవేదన చెందుతున్నారు. కోతులతో ప్రతిసారి పెద్ద ఎత్తున పంట నష్టం జరుగుతోందని.. ప్రభుత్వం స్పందించి తమకు కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.

monkey-attack-on-maize-crops-feeders-in-a-state-of-disorientation
మొక్కజొన్న పంటలపై వానరాల దాడి.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు

ఇదీచూడండి.. పరీక్షల వాయిదాకు నేడు​ కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.