గోదావరి ద్వారా నీరు సముద్రంలోకి వృథాగా పోతున్నా... కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి జగిత్యాలలో ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎల్లంపల్లిలోకి వచ్చిన కడెం ప్రాజెక్టు నీటినే... మిడ్మానేరు, ఎల్ఎండీలోకి 16 టీఎంసీలు ఎత్తిపోశారని వివరించారు. ప్రాజెక్టునుంచి చుక్కనీరు పైకి ఎత్తిపోయలేదని... దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద నీటిని నిల్వ చేయటానికి మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుకు అదనంగా రూ. 4 వేల 6 వందల కోట్ల పనులను నామినేషన్ పద్దతిలో అప్పగించడాన్ని బట్టి అవినితీ ఏ మేరకు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చని జీవన్రెడ్డి వివరించారు.
ఇవీ చూడండి: చేతబడి నెపంతో వ్యక్తి దారుణ హత్య