జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ చెరువులోకి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ 2 లక్షల 60వేల చేపపిల్లలను వదిలారు. మత్స్యకారులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇటీవలే ఎల్లంపల్లి పైప్ లైన్ ద్వారా కొడిమ్యాల మండలంలోని చెరువులు నిండడం వల్ల చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు పునుగోటి ప్రశాంతి, ఎంపీపీ మేనేని స్వర్ణలతతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష