ETV Bharat / state

మాస్క్​తో ఆంజనేయస్వామి కరోనోపదేశం - telangana varthalu

ప్రతి ఒక్కరు మాస్క్​ పెట్టుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచనలు చేసింది. కానీ చాలా మంది కరోనా నిబంధనలను పాటించడం లేదు. ఇది గమనించిన సాక్షాత్తు ఆంజనేయ స్వామి స్వయంగా తానే మాస్క్​ ధరించి ప్రజలకు కరోనోపదేశం ఇస్తున్నారు.

mask hanuman
ఆంజనేయ స్వామి కరోనోపదేశం
author img

By

Published : Apr 17, 2021, 7:41 PM IST

Updated : Apr 22, 2021, 1:28 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం ఐలాపూర్​లో​ హనుమాన్ జయంతి పూజలకు సిద్ధంగా ఉన్న ఆంజనేయస్వామి ప్రజలకు కరోనా సందేశాన్ని ఇస్తున్నారు. సాధారణంగా విగ్రహ ఆవిష్కరణ పూజలు అయ్యేంతవరకు కళ్లకు గంతలు కట్టేస్తారు. ఆ గంతలు కాస్త కిందికి దిగి ముఖానికి మాస్క్​గా మారింది. మాస్కుతో కనిపిస్తున్న ఆంజనేయుడు భక్తులకు కరోనాపదేశం ఇస్తున్నట్టు దర్శనమిస్తోంది.

మాస్క్​తో ఆంజనేయస్వామి కరోనోపదేశం

కరోనా ముందు మనుషులే కాదు దేవుడు కూడా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని చెప్తున్నట్టు కనిపిస్తోంది. మాస్క్ తప్పనిసరి అని సాక్షాత్తు ఆంజనేయుడు ఇస్తున్న సందేశాన్ని చూసైనా ప్రజలు ఫాలో అవుతారేమో చూద్దాం.

ఇదీ చదవండి: 'అవసరమైతే కొవిడ్​ బోగీలను వినియోగించుకోండి'

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం ఐలాపూర్​లో​ హనుమాన్ జయంతి పూజలకు సిద్ధంగా ఉన్న ఆంజనేయస్వామి ప్రజలకు కరోనా సందేశాన్ని ఇస్తున్నారు. సాధారణంగా విగ్రహ ఆవిష్కరణ పూజలు అయ్యేంతవరకు కళ్లకు గంతలు కట్టేస్తారు. ఆ గంతలు కాస్త కిందికి దిగి ముఖానికి మాస్క్​గా మారింది. మాస్కుతో కనిపిస్తున్న ఆంజనేయుడు భక్తులకు కరోనాపదేశం ఇస్తున్నట్టు దర్శనమిస్తోంది.

మాస్క్​తో ఆంజనేయస్వామి కరోనోపదేశం

కరోనా ముందు మనుషులే కాదు దేవుడు కూడా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని చెప్తున్నట్టు కనిపిస్తోంది. మాస్క్ తప్పనిసరి అని సాక్షాత్తు ఆంజనేయుడు ఇస్తున్న సందేశాన్ని చూసైనా ప్రజలు ఫాలో అవుతారేమో చూద్దాం.

ఇదీ చదవండి: 'అవసరమైతే కొవిడ్​ బోగీలను వినియోగించుకోండి'

Last Updated : Apr 22, 2021, 1:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.