జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్లో సాయి బార్ అండ్ రెస్టారెంట్లో విద్యుదాఘాతంతో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక వాహనంతో సకాలంలో మంటలను ఆర్పివేశారు. బార్లో పలు వస్తువులు, కొంతమేర మద్యం కాలిపోయింది. సుమారు రూ.50వేల నష్టం వాటిల్లింది.
ఇదీ చూడండి: భాజపా-శివసేన మధ్య 'మహా' తూటాలు