ETV Bharat / state

అగ్గిరాజేస్తోన్న జగిత్యాల మాస్టర్‌ ప్లాన్ వివాదం.. రద్దు చేయాలంటూ రోడ్డెక్కిన అన్నదాతలు

author img

By

Published : Jan 11, 2023, 3:50 PM IST

Updated : Jan 11, 2023, 7:35 PM IST

Jagtial Master Plan Issue Updates : జగిత్యాల భవిష్యత్ అవసరాల దృష్ట్యా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ముసాయిదా అగ్గిరాజేస్తోంది. పట్టణ అవసరాల కోసం తమ పట్టా భూములను మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగారం లాంటి పంట భూములను పారిశ్రామిక జోన్‌లో చేర్చడంపై మండిపడుతున్నారు. కొన్ని గ్రామాల సర్పంచులు బలవంతంగా తమతో తీర్మానాలు చేయించారని ఆరోపిస్తున్నారు. బృహత్తర ప్రణాళిక రద్దు చేయకపోతే సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తమ పదవులకు రాజీనామా చేస్తామని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రకటించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

Jagtial Master Plan Issue Updates
Jagtial Master Plan Issue Updates

Jagtial Master Plan Issue Updates : జగిత్యాల ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌ చిచ్చు రేపుతోంది. 2041 వరకు పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బృహత్తర ప్రణాళికకు ముసాయిదా విడుదల చేసింది. మాస్టర్ ప్లాన్‌లో రాబోయే 20 ఏళ్లలో చేపట్టబోయే రోడ్ల విస్తరణ, పారిశ్రామిక, వాణిజ్య, పబ్లిక్‌, సెమీ పబ్లిక్‌, పార్క్‌, ప్లేగ్రౌండ్స్‌ తదితర జోన్లను ప్రతిపాదించారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌లో విస్తీర్ణాన్ని 6084 హెక్టార్లుగా ప్రతిపాదించారు. 823 హెక్టార్లు పట్టణ ప్రాంతాన్ని, 216 హెక్టార్లు రహదారుల విస్తరణ, 209 హెక్టార్లు కొత్త రోడ్ల నిర్మాణం, 324 హెక్టార్లు ఉద్యాన, వినోద పార్కులు, 309 హెక్టార్లు వాణిజ్య జోన్‌, 2423 హెక్టార్లు నివాసిత ప్రాంతం, 238 హెక్టార్లు అటవీ ప్రాంతం, 546 హెక్టార్లు చెరువులు, 372 హెక్టార్లను గుట్టలుగా ప్రతిపాదించారు.

మాస్టర్‌ ప్లాన్ వివాదం.. రద్దు చేయాలంటూ రోడ్డెక్కిన జగిత్యాల రైతులు
  • కొత్త మాస్టర్​ ప్లాన్​ ఇలా..
ప్రాంతం(జోన్లు)భూ విస్తీర్ణం (హెక్టార్లలో)
పట్టణ ప్రాంతం823
రహదారుల విస్తరణ216
కొత్త రోడ్ల నిర్మాణం209
ఉద్యాన, వినోద పార్కులు324
వాణిజ్య జోన్​309
నివాసిత ప్రాంతం2423
అటవీ ప్రాంతం238
చెరువులు546
గుట్టలు372
ఇతరములుమిగిలిన భూమి
మెుత్తం6084

ఏ గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు: మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాలో సమీప గ్రామాలను చేర్చడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నర్సింగాపూర్‌, కండ్లపల్లి, తిమ్మాపూర్‌, తిప్పన్నపేట, హస్నాబాద్‌, లింగంపేట, మోతె వాసులు తమ భూములపై హక్కులు కోల్పోతామని వాపోతున్నారు. కనీస అవగాహన కల్పించకుండానే పంచాయతీల తీర్మానాలను బలవంతంగా తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.

మాస్టర్​ ప్లాన్​ మాకొద్దు: హస్నాబాద్‌, నూకపల్లి, ధరూర్‌, తిప్పన్నపేట, తిమ్మాపూర్‌, మోతె గ్రామ పంచాయతీలు సమ్మతి తెలియజేస్తూ తీర్మానాలు అందించాయి. గ్రామ సభలు నిర్వహించకుండానే సమ్మతి తెలుపుతూ తీర్మానించిన సర్పంచ్‌లు సైతం మాస్టల్‌ ప్లాన్‌ వద్దంటూ అధికారులకు విన్నవిస్తున్నారు . తీర్మానంలో ఏముందో తెలియకుండానే యంత్రాంగం ఒత్తిడితో సంతకాలు చేసినట్లు చెబుతున్నారు. బఫర్‌జోన్‌, ఇండస్ట్రియల్‌, రిక్రియేషన్‌, పబ్లిక్‌ సెమీ, పబ్లిక్‌ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు లభించవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతుల నుంచి నాయకుల వరకు: అధికారులు ఇది కేవలం ప్రతిపాదన అని ప్రకటించినా రైతులు ఆయా గ్రామాల వారు మాత్రం ముసాయిదాను ఎట్టి పరిస్థితిలో అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు.మాస్టర్ ప్లాన్‌ ముసాయిదాపై తొలుత రైతుల నుంచి నిరసన వ్యక్తం కాగా..ఇప్పడు అధికార పార్టీకి చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు తోడయ్యారు. రద్దు చేయకుంటే పదవులు త్యజించేందుకు సిద్ధమని ప్రకటించారు.

ఇవీ చదవండి:

Jagtial Master Plan Issue Updates : జగిత్యాల ప్రతిపాదిత మాస్టర్‌ ప్లాన్‌ చిచ్చు రేపుతోంది. 2041 వరకు పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బృహత్తర ప్రణాళికకు ముసాయిదా విడుదల చేసింది. మాస్టర్ ప్లాన్‌లో రాబోయే 20 ఏళ్లలో చేపట్టబోయే రోడ్ల విస్తరణ, పారిశ్రామిక, వాణిజ్య, పబ్లిక్‌, సెమీ పబ్లిక్‌, పార్క్‌, ప్లేగ్రౌండ్స్‌ తదితర జోన్లను ప్రతిపాదించారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌లో విస్తీర్ణాన్ని 6084 హెక్టార్లుగా ప్రతిపాదించారు. 823 హెక్టార్లు పట్టణ ప్రాంతాన్ని, 216 హెక్టార్లు రహదారుల విస్తరణ, 209 హెక్టార్లు కొత్త రోడ్ల నిర్మాణం, 324 హెక్టార్లు ఉద్యాన, వినోద పార్కులు, 309 హెక్టార్లు వాణిజ్య జోన్‌, 2423 హెక్టార్లు నివాసిత ప్రాంతం, 238 హెక్టార్లు అటవీ ప్రాంతం, 546 హెక్టార్లు చెరువులు, 372 హెక్టార్లను గుట్టలుగా ప్రతిపాదించారు.

మాస్టర్‌ ప్లాన్ వివాదం.. రద్దు చేయాలంటూ రోడ్డెక్కిన జగిత్యాల రైతులు
  • కొత్త మాస్టర్​ ప్లాన్​ ఇలా..
ప్రాంతం(జోన్లు)భూ విస్తీర్ణం (హెక్టార్లలో)
పట్టణ ప్రాంతం823
రహదారుల విస్తరణ216
కొత్త రోడ్ల నిర్మాణం209
ఉద్యాన, వినోద పార్కులు324
వాణిజ్య జోన్​309
నివాసిత ప్రాంతం2423
అటవీ ప్రాంతం238
చెరువులు546
గుట్టలు372
ఇతరములుమిగిలిన భూమి
మెుత్తం6084

ఏ గ్రామాల రైతులు భూములు కోల్పోతున్నారు: మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదాలో సమీప గ్రామాలను చేర్చడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నర్సింగాపూర్‌, కండ్లపల్లి, తిమ్మాపూర్‌, తిప్పన్నపేట, హస్నాబాద్‌, లింగంపేట, మోతె వాసులు తమ భూములపై హక్కులు కోల్పోతామని వాపోతున్నారు. కనీస అవగాహన కల్పించకుండానే పంచాయతీల తీర్మానాలను బలవంతంగా తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.

మాస్టర్​ ప్లాన్​ మాకొద్దు: హస్నాబాద్‌, నూకపల్లి, ధరూర్‌, తిప్పన్నపేట, తిమ్మాపూర్‌, మోతె గ్రామ పంచాయతీలు సమ్మతి తెలియజేస్తూ తీర్మానాలు అందించాయి. గ్రామ సభలు నిర్వహించకుండానే సమ్మతి తెలుపుతూ తీర్మానించిన సర్పంచ్‌లు సైతం మాస్టల్‌ ప్లాన్‌ వద్దంటూ అధికారులకు విన్నవిస్తున్నారు . తీర్మానంలో ఏముందో తెలియకుండానే యంత్రాంగం ఒత్తిడితో సంతకాలు చేసినట్లు చెబుతున్నారు. బఫర్‌జోన్‌, ఇండస్ట్రియల్‌, రిక్రియేషన్‌, పబ్లిక్‌ సెమీ, పబ్లిక్‌ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు లభించవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతుల నుంచి నాయకుల వరకు: అధికారులు ఇది కేవలం ప్రతిపాదన అని ప్రకటించినా రైతులు ఆయా గ్రామాల వారు మాత్రం ముసాయిదాను ఎట్టి పరిస్థితిలో అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నారు.మాస్టర్ ప్లాన్‌ ముసాయిదాపై తొలుత రైతుల నుంచి నిరసన వ్యక్తం కాగా..ఇప్పడు అధికార పార్టీకి చెందిన సర్పంచులు,ఎంపీటీసీలు తోడయ్యారు. రద్దు చేయకుంటే పదవులు త్యజించేందుకు సిద్ధమని ప్రకటించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 11, 2023, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.