డీజీపీ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందికి జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి... డ్రైఫ్రూట్స్, విటమిన్ మాత్రలు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి సరైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు.
విధి నిర్వాహణలో కొంత మంది సిబ్బంది వైరస్ బారిన పడ్డారు. ఓ ఎస్సైతో పాటు మరో ఆరుగురు సిబ్బంది కరోనా బారినుంచి కోలుకుని ఇటీవలే వీధుల్లో చేరారు.
ఇవీ చూడండి: నూతన విద్యా విధానం: బంగరు భవితకు నారుమడి!