ETV Bharat / state

'జెరుసలేం యాత్రకు రాయితీ కోసం కృషి చేస్తా' - CHRISTIAN COMMUNITY THANKS TO CM KCR AND BOINPALLY VINOD KUMAR

క్రిస్టియన్‌ మైనారిటీలకు జెరుసలేం వెళ్లేందుకు రాయితీ కల్పించాలని యూసీసీసీ ప్రతినిధులు ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయిన్​పల్లి వినోద్ కుమార్​ను కోరారు. క్రిస్టియన్​ల స్మశాన వాటిక కోసం 68.32 ఎకరాల స్థలం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : వినోద్
అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : వినోద్
author img

By

Published : Dec 2, 2019, 8:22 PM IST

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయిన్​పల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. యునైటెడ్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కమిటీ-యుసీసీసీ ప్రతినిధులతో వినోద్ కుమార్ తన సమావేశంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్రిస్టియన్‌లకు జెరుసలేం పవిత్ర యాత్రకు వెళ్లేందుకు ప్రభుత్వపరంగా రాయితీ ఇప్పించాలని యూసీసీసీ ప్రతినిధులు వినోద్​ను కోరారు. విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.

అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : వినోద్


యూసీసీసీ ఆధ్వర్యంలో 18 నుంచి క్రిస్మస్ వేడుకలు...
చదువు వజ్రాయుధమని, అందుకే సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మెరుగైన విద్యాభ్యాసం కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ గురుకులాలు కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో తెలంగాణ దేశంలోనే గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. యూసీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 18న సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా వినోద్ కుమార్‌ను ఆహ్వానించారు.


ఇవీ చూడండి : విల్లామేరి కాలేజిలో విద్యార్థుల డిజైన్‌ ఉత్పత్తుల ప్రదర్శన

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయిన్​పల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. యునైటెడ్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కమిటీ-యుసీసీసీ ప్రతినిధులతో వినోద్ కుమార్ తన సమావేశంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్రిస్టియన్‌లకు జెరుసలేం పవిత్ర యాత్రకు వెళ్లేందుకు ప్రభుత్వపరంగా రాయితీ ఇప్పించాలని యూసీసీసీ ప్రతినిధులు వినోద్​ను కోరారు. విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.

అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : వినోద్


యూసీసీసీ ఆధ్వర్యంలో 18 నుంచి క్రిస్మస్ వేడుకలు...
చదువు వజ్రాయుధమని, అందుకే సీఎం కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మెరుగైన విద్యాభ్యాసం కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ గురుకులాలు కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో తెలంగాణ దేశంలోనే గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. యూసీసీసీ ఆధ్వర్యంలో ఈనెల 18న సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా వినోద్ కుమార్‌ను ఆహ్వానించారు.


ఇవీ చూడండి : విల్లామేరి కాలేజిలో విద్యార్థుల డిజైన్‌ ఉత్పత్తుల ప్రదర్శన

TG_Hyd_65_02_STATE_PLANNING_COMMITTEE_AV_3038066 Reporter: Tirupal Reddy ()సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ తన నివాసంలో తనను కలిసిన యునైటెడ్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కమిటీ-యుసిసిసి ప్రతినిధులతో వినోద్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యూసిసిసి కో-చైర్ పర్సన్స్ డాక్టర్ విద్యా స్రవంతి, జీ.డీ.అరుణ, వైస్ చైర్మన్‌లు ఏసుదాస్, థామస్ జాన్, ప్రధాన కార్యదర్శి రాబర్ట్ సూర్యప్రకాశ్, కోఆర్డినేటర్ జేమ్స్ సిల్వెస్టర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్రిస్టియన్‌లకు జెరూసలేం పవిత్ర యాత్రకు వెళ్లేందుకు ప్రభుత్వపరంగా రాయితీ ఇప్పించాలని యూసిసిసి ప్రతినిధులు వినోద్ కుమార్‌ను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి కి తీసుకెళ్తానని వారికి హామీ ఇచ్చిన ఆయన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. చదువు వజ్రాయుధమని, దాని ప్రాముఖ్యత తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మెరుగైన విద్యాభ్యాసం కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వ గురుకులాలు కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నీటి పారుదల, విద్యుత్ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే గణనీయమైన ప్రగతిని సాధించిందన్న వినోద్ కుమార్ ఇతర రంగాల్లోనూ తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తోందని తెలిపారు. యూసిసిసి ఆధ్వర్యంలో ఈనెల 18న సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా వినోద్ కుమార్‌ను ఆహ్వానించారు. క్రిస్టియన్‌ల స్మశాన వాటిక కోసం తెలంగాణ ప్రభుత్వం 68.32 ఎకరాల భూమిని కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, అందుకు సహకారం అందించిన వినోద్ కుమార్‌లకు యూసిసిసి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.