ETV Bharat / state

Etala: వారం రోజుల్లో దిల్లీ వెళ్లి భాజపాలో చేరుతా: ఈటల - eatala rajendhar chitchat

వారం రోజుల్లో దిల్లీ వెళ్లి భాజపాలో చేరుతా: ఈటల
వారం రోజుల్లో దిల్లీ వెళ్లి భాజపాలో చేరుతా: ఈటల
author img

By

Published : Jun 4, 2021, 1:46 PM IST

Updated : Jun 4, 2021, 5:09 PM IST

13:44 June 04

Etala: వారం రోజుల్లో దిల్లీ వెళ్లి భాజపాలో చేరుతా: ఈటల

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ వారం రోజుల్లో భాజపా చేరనున్నట్లు ప్రకటించారు. తనలో కమ్యూనిస్టు డీఎన్ఏ ఉన్నప్పటికీ ప్రజల ఒత్తిడి మేరకే భాజపాలో చేరాల్సి వస్తుందని మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తెలిపారు. ఒక వ్యవస్థతో ఒక వ్యక్తి పోటీ పడటం సాధ్యం కాదన్నారు. ముందు పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నప్పటికీ డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

తనను ఓడించడమే లక్ష్యంగా తెరాస ఇప్పటికే హుజురాబాద్​లో తెరాస 50 కోట్లు ఖర్చు పెట్టిందని మండిపడ్డారు. దిల్లీ పర్యటనలో భాగంగా భాజపా, తెరాస మధ్య ఉన్న సంబంధమేంటని ప్రశ్నించినట్లు చెప్పారు. నడ్డాతో పాటు భాజపా సంస్థాగత కార్యదర్శి బీఎల్‌.సంతోష్‌తో భేటీ అయినట్లు తెలిపారు. అనారోగ్య కారణాలతో అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు కేసీఆర్ మార్గ నిర్ధేశనంలో పని చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ కొవిడ్‌ కారణాలతో దిల్లీలోనే చేరికలు ఉంటాయని తెలిపారు. రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న ఆయన... గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ధ నివాళులు అర్పించిన అనంతరం స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను అందించనున్నట్లు తెలిపారు. 

ఇదీ చూడండి: Eatala Resign : ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల రాజీనామా

13:44 June 04

Etala: వారం రోజుల్లో దిల్లీ వెళ్లి భాజపాలో చేరుతా: ఈటల

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ వారం రోజుల్లో భాజపా చేరనున్నట్లు ప్రకటించారు. తనలో కమ్యూనిస్టు డీఎన్ఏ ఉన్నప్పటికీ ప్రజల ఒత్తిడి మేరకే భాజపాలో చేరాల్సి వస్తుందని మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తెలిపారు. ఒక వ్యవస్థతో ఒక వ్యక్తి పోటీ పడటం సాధ్యం కాదన్నారు. ముందు పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నప్పటికీ డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

తనను ఓడించడమే లక్ష్యంగా తెరాస ఇప్పటికే హుజురాబాద్​లో తెరాస 50 కోట్లు ఖర్చు పెట్టిందని మండిపడ్డారు. దిల్లీ పర్యటనలో భాగంగా భాజపా, తెరాస మధ్య ఉన్న సంబంధమేంటని ప్రశ్నించినట్లు చెప్పారు. నడ్డాతో పాటు భాజపా సంస్థాగత కార్యదర్శి బీఎల్‌.సంతోష్‌తో భేటీ అయినట్లు తెలిపారు. అనారోగ్య కారణాలతో అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలు కేసీఆర్ మార్గ నిర్ధేశనంలో పని చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భాజపాలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ కొవిడ్‌ కారణాలతో దిల్లీలోనే చేరికలు ఉంటాయని తెలిపారు. రేపు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న ఆయన... గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ధ నివాళులు అర్పించిన అనంతరం స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను అందించనున్నట్లు తెలిపారు. 

ఇదీ చూడండి: Eatala Resign : ఎమ్మెల్యే పదవికి రేపు ఈటల రాజీనామా

Last Updated : Jun 4, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.