ETV Bharat / state

భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన కొత్త సెల్​ఫోన్ - కర్నూలులో మహిళ ఆత్మహత్య వార్తలు

భార్యాభర్తల మధ్య ఫోన్ చిచ్చు పెట్టింది. భర్త కొత్త ఫోన్ కొన్న క్రమంలో దంపతుల మధ్య గొడవ మొదలైంది. మనస్తాపం చెందిన భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

wife-suicide-for-cell-phone-issue-in-kurnool
భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన కొత్త సెల్​ఫోన్
author img

By

Published : May 29, 2020, 10:38 AM IST

Updated : May 29, 2020, 11:56 AM IST

పచ్చని కాపురంలో కొత్తగా కొన్న సెల్​ఫోన్ చిచ్చు పెట్టింది. భార్యాభర్తల మధ్య రేగిన వివాదంతో... వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని వగరూరులో జరిగింది.

పార్వతి భర్త నాగరాజు మూడు రోజుల కిందట 15 వేల రూపాయలు పెట్టి కొత్త ఫోన్ కొన్నాడు. అది చెడిపోవడంతో మరమ్మతు కోసం భార్యను డబ్బులు అడిగాడు. లాక్​డౌన్ కారణంగా ఇళ్లు గడవడం కష్టంగా ఉందని.. సెల్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తే ఎలా అని భార్య ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

మనస్తాపంతో భార్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వీరు జీవనం సాగిస్తుంటారు.

ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్​ కోసం మళ్లీ ప్లాస్మా దానం

పచ్చని కాపురంలో కొత్తగా కొన్న సెల్​ఫోన్ చిచ్చు పెట్టింది. భార్యాభర్తల మధ్య రేగిన వివాదంతో... వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలోని వగరూరులో జరిగింది.

పార్వతి భర్త నాగరాజు మూడు రోజుల కిందట 15 వేల రూపాయలు పెట్టి కొత్త ఫోన్ కొన్నాడు. అది చెడిపోవడంతో మరమ్మతు కోసం భార్యను డబ్బులు అడిగాడు. లాక్​డౌన్ కారణంగా ఇళ్లు గడవడం కష్టంగా ఉందని.. సెల్ కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తే ఎలా అని భార్య ప్రశ్నించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

మనస్తాపంతో భార్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి వీరు జీవనం సాగిస్తుంటారు.

ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్​ కోసం మళ్లీ ప్లాస్మా దానం

Last Updated : May 29, 2020, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.