ETV Bharat / state

విశాఖ డెయిరీ బంపర్ ఆఫర్... రైతులకు రూ.35 కోట్ల బోనస్ - పాడి రైతులకు సంక్రాంతి బోనస్ ను ప్రకటించిన విశాఖ డైరీ

విశాఖ డెయిరీ పాడి రైతులకు రూ. 35 కోట్ల సంక్రాంతి బోనస్ ప్రకటించింది. రైతులను ఆదుకోవడం కోసం ఈ భారీ మొత్తాన్ని బోనస్​గా ఇస్తున్నామని విశాఖ డైరీ వైస్ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ చెప్పారు. రైతులు డెయిరీకి అందించే గేదె పాలకు లీటర్​కి రెండు రూపాయల ధర పెంచుతున్నామని ప్రకటించారు.

visakha-dairy-offers-35-crore-rupeess-wallpaper-bonus-to-dairy-farmers-says-visakha-dairy-vice-chairman-adari-anand-kumar
విశాఖ డెయిరీ బంపర్ ఆఫర్... రైతులకు రూ.35 కోట్ల బోనస్
author img

By

Published : Jan 15, 2021, 2:41 PM IST

visakha-dairy-offers-35-crore-rupeess-wallpaper-bonus-to-dairy-farmers-says-visakha-dairy-vice-chairman-adari-anand-kumar
పాడి రైతులకు బోనస్ అందజేత

విశాఖ డెయిరీ సంక్రాంతి బోనస్​గా పాడి రైతులకు 35 కోట్ల రూపాయలు ప్రకటించింది. డెయిరీ పరిధిలోని 5 జిల్లాల్లో పాలు సరఫరా చేసే రైతులకు ఈ సొమ్ముపంపిణీ చేసింది. డెయిరీ పరిధిలో లక్షా 40 వేల మంది రైతులు నుంచి లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నారు.

పాడి రైతులను ఆదుకోవడం కోసం భారీ మొత్తాన్ని బోనస్​గా ఇచ్చామని విశాఖ డెయిరీ వైస్ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ చెప్పారు. ఎలమంచిలి పాడి రైతులకు చెక్కుల పంపిణీతో కార్యక్రమాన్ని ఆరంభించారు.

గేదె పాలకు లీటర్​కి రెండు రూపాయల ధర పెంచుతున్నట్టు విశాఖ డెయిరీ ప్రకటించింది. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి పాడి రైతుకి సంక్రాంతి పురస్కరించుకుని స్టీల్ గిన్నెలు ఉచితంగా అందించారు.

ఇదీ చదవండి: 'గల్వాన్​లో బుద్ధి చెప్పాం.. ఇంకా సహనాన్ని పరీక్షించొద్దు'

visakha-dairy-offers-35-crore-rupeess-wallpaper-bonus-to-dairy-farmers-says-visakha-dairy-vice-chairman-adari-anand-kumar
పాడి రైతులకు బోనస్ అందజేత

విశాఖ డెయిరీ సంక్రాంతి బోనస్​గా పాడి రైతులకు 35 కోట్ల రూపాయలు ప్రకటించింది. డెయిరీ పరిధిలోని 5 జిల్లాల్లో పాలు సరఫరా చేసే రైతులకు ఈ సొమ్ముపంపిణీ చేసింది. డెయిరీ పరిధిలో లక్షా 40 వేల మంది రైతులు నుంచి లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నారు.

పాడి రైతులను ఆదుకోవడం కోసం భారీ మొత్తాన్ని బోనస్​గా ఇచ్చామని విశాఖ డెయిరీ వైస్ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ చెప్పారు. ఎలమంచిలి పాడి రైతులకు చెక్కుల పంపిణీతో కార్యక్రమాన్ని ఆరంభించారు.

గేదె పాలకు లీటర్​కి రెండు రూపాయల ధర పెంచుతున్నట్టు విశాఖ డెయిరీ ప్రకటించింది. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి పాడి రైతుకి సంక్రాంతి పురస్కరించుకుని స్టీల్ గిన్నెలు ఉచితంగా అందించారు.

ఇదీ చదవండి: 'గల్వాన్​లో బుద్ధి చెప్పాం.. ఇంకా సహనాన్ని పరీక్షించొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.