ఆదాయానికి మించిన ఆస్థుల కేసులో వ్యక్తిగత మినహాయింపు కోరుతూ జగన్ వేసిన పిటిషన్పై ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. సీబీఐ ఊహాజనిత ఆరోపణలతో కౌంటర్ దాఖలు చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కౌంటర్లో సీబీఐ వాడిన భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నాననీ.. తాను హాజరు కాకుంటే విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో తెలపాలన్నారు. ఆరేళ్లుగా ఎప్పుడూ కేసుల వాయిదా కోరలేదనీ.. స్టే అడగలేదని అన్నారు. ముఖ్యమంత్రిగా పాలన చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత తనపై ఉందన్నారు. సాక్షులను ప్రభావితం చేసినట్లు ఒక్క ఆరోపణ తనపై లేదన్నారు.
అన్నీ పరిశీలించాకే..
గతంలో సీబీఐ కోర్టు, హైకోర్టు అన్ని అంశాలూ పరిశీలించాకే వ్యక్తిగత హాజరు మినహాయింపును నిరాకరించాయని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జగన్ హోదా మినహా కేసు పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు.
ఇవీ చదవండి.